శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో శనివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 4.0 తీవ్రతతో ప్రకంపణలు వచ్చాయి. తెల్లవారు జామున 2.53 గంటలకు భూమి కంపించిందని నేషనల్ సెంటర్ సిస్మోలజీ పేర్కొంది. కార్గిల్కు 168 కిలోమీటర్ల దూరంలో, భూమికి పది కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు చెప్పింది. అలాగే మధ్యాహ్నం 2.16 గంటల ప్రాంతంలో బే ఆఫ్ బెంగాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 4.5 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని.. ఒడిశాలోని పూరీకి 230 కిలోమీటర్లు, ఏపీలోని కాకినాడకు 312 కిలోమీటర్ల దూరంలో, భూమికి వంద కిలోమీటర్ల లోతులో భూకంప కేందాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.