ముంబై: దేశంలో కరోనా కల్లోలం ఉధృతమవుతున్నది. రోజువారీగా నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. ముఖ్యంగా మహారాష్ట్రలో పరిస్థితి దారుణంగా ఉన్నది. అక్కడ ప్రతిరోజు 50 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్కూల్, కాలేజీల పరీక్షలకు సంబంధించి మహారాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర బోర్డు పరిధిలోని 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యామంత్రి వర్ష గైక్వాడ్ వెల్లడించారు.
12వ తరగతి పరీక్షలను మే నెలాఖరులో, 10వ తరగతి పరీక్షలను జూన్లో నిర్వహించనున్నట్లు వర్ష గైక్వాడ్ తెలిపారు. ఆయా పరీక్షల నిర్వహణకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలో వెల్లడించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ప్రకటించిన పరీక్షల తేదీలను మార్చాలని కోరుతూ సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, కేంబ్రిడ్జి బోర్డులకు లేఖలు రాస్తామని వర్ష గైక్వాడ్ వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
జర్నలిస్టుల డబుల్ బెడ్రూం ఇండ్లకు కేటీఆర్ శంకుస్థాపన
నాకు పాజిటివ్ వచ్చిందా.. పకోడీలు వేశాక వస్తాలే..!
కరోనాతో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
వింత ఆచారం: దున్నపోతుతో తొక్కించుకుంటే మంచి జరుగుతుందట..!
నూకాలమ్మ జాతరలో గిరినాగు ప్రత్యక్షం.. భయంతో పరుగులు తీసిన జనం..!
టీకాలే లేకుండా టీకా ఉత్సవ్ ఎలా.. ప్రధానికి ముఖ్యమంత్రుల లేఖలు..!
కాబోయే భర్త రమ్మన్నాడు.. ఆ తర్వాత హత్య