ముంబై : ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తిన విషయం వెలుగులోకి వచ్చింది. దుబాయి నుంచి కొచ్చికి బయలుదేరిన ఎయిర్ ఇండియాకు చెందిన బీ787 విమానం (flight number-934)లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని ముంబైలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో ప్రెషర్కు సంబంధించిన సమస్యలు ఏర్పడడంతో విమానాన్ని మళ్లించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఈ ఘటనపై ఇద్దరు సీనియర్ అధికారులు విచారణ జరుపుతున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల వరుసగా భారత విమానయాన సంస్థలకు చెందిన పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఆకాశంలో ఉన్న సమయంలోనే టెక్నికల్ సమస్యలు వస్తున్నాయి. దీంతో సమీపంలోని విమానాశ్రయాలకు మళ్లించిన విషయం తెలిసిందే.