అహ్మదాబాద్: గుజరాత్ తీరంలో మరోసారి భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఆ రాష్ట్ర ఏటీఎస్ వర్గాలు అందించిన నిఘా సమాచారం మేరకు ఇండియన్ కోస్ట్ గార్డ్ దళం సోమవారం తెల్లవారుజామున అరేబియా సముద్రంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ ఇరాన్ బోటును,
అందులోని ఐదుగురు సిబ్బందిని నిర్బంధించి రూ.425 కోట్ల విలువైన 61 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నది. ఓఖా తీరానికి దాదాపు 340 కిలోమీటర్ల దూరాన భారత ప్రాదేశిక జలాల్లో ఈ ఘటన జరిగింది.