అహ్మదాబాద్: మహారాష్ట్రలో డీఆర్ఐ అధికారులు భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుకొన్నారు. ఛత్రపతి శంభాజీనగర్లో 23 కేజీల కొకైన్, 2.9 కేజీల మెఫెడ్రోన్తో పాటు ఒక నిందితుడి ఇంటి నుంచి 30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఓ ఫ్యాక్టరీలో పట్టుబడిన మాదక ద్రవ్యాల విలువ రూ.250 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు.