ముంబై : మహారాష్ట్రలోని నవీ ముంబైలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ శనివారం పెద్ద ఎత్తున డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నది. వాషిలో దిగుమతి చేసుకున్న నారింజ పండ్లను తీసుకెళ్తున్న ట్రక్కులో తనిఖీలు నిర్వహించి.. 198 కిలోల హై ప్యూరిటీ క్రిస్టల్ మెథాంఫేటమిన్ (ice)తో పాటు తొమ్మిది కిలోల హై ప్యూరిటీ కొకైన్ను స్వాధీనం చేసుకున్నది.
ఈ డ్రగ్స్ ఖరీదు దాదాపు రూ.1476 కోట్లు ఉంటుందని డీఆర్ఐ వర్గాలు తెలిపాయి. డ్రగ్స్ను స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నట్లు అధికార వర్గాలు ర్కొన్నాయి. వాలెన్సియా నారింజ పండ్లను తరలించే బాక్సుల్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ దాచి రవాణా చేస్తుండగా పక్కాగా అందిన సమాచారం మేరకు అధికారులు దాడి చేశారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.