DRDO | భారత రక్షణ, పరిశోధనా సంస్థ డీఆర్డీవో మరో ఘనత సాధించింది. వెరీ నాల్గోతరం ష్టార్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (VSHORADS) మిస్సైల్ను శనివారం విజయవంతంగా పరీక్షించింది. రాజస్థాన్లోని పోఖ్రాన్లోని అటామిక్ రేంజ్లో టెస్ట్ జరిగింది. దేశీయంగా అభివృద్ధి చేసిన షార్ట్ రేంజ్ మిస్సైల్ని విజయవంతంగా లక్ష్యాన్ని చేధించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మిస్సైల్ శ్రతువుల విమానాలు, డ్రోన్స్ సహా ఇతర టార్గెట్స్ సహా తక్కువ ఎత్తులో ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతుందని డీఆర్డీవో పేర్కొంది. ఇప్పటికే రెండుసార్లు పరీక్షలు విజయవంతంగా నిర్వహించగా.. తాజాగా మూడోసారి సైతం లక్ష్యాన్ని తాకింది. ఈ సందర్భంగా డీఆర్డీవో, ఆర్మీ, కంపెనీలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు.
పోఖ్రాన్ నుంచి సాంకేతికత అధునాతన ఆయుధ వ్యవస్థ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని విజయవంతంగా పరీక్షించారన్న ఆయన.. వైమానిక ముప్పునకు వ్యతిరేకంగా.. సాయుధ బలగాలకు మరింత సాంకేతిక సహాయాన్ని అందిస్తుందన్నారు. ష్టార్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (VSHORADS), మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (MANPAD) డీఆర్డీవో, భారతీయ పరిశ్రమ భాగస్వాముల సహకారంతో రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI) అభివృద్ధి చేసిన స్వదేశీ క్షిపణి. అంతకుముందు భారత్ ఈ ఏడాది మేలో స్వదేశీ రుద్రమ్-II ఎయిర్-టు గ్రౌండ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే.