హైదరాబాద్: ద్రౌపది ముర్ము జీవితంలో విషాదాలు చాలానే ఉన్నాయి. 1984లో మొదటి కుమార్తె, 2010లో 25 ఏళ్ల కుమారుడు, 2013లో 28 ఏళ్ల వయసులో చిన్న కూతురు, 2014లో భర్త శ్యామ్ 55 ఏళ్ల వయసులో మరణించారు. ఆ సమయంలో ముర్ము తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లింది. భర్త మరణించిన తర్వాత ఆమెకు ఏం చేయాలో తోచలేదు. దీంతో ఆమె రాయ్రంగాపూర్లో ఉన్న బ్రహ్మకుమారి ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ ఆమె ధ్యానం చేయడం అలవాటు చేసుకున్నారు.
డిప్రెషన్ను జయించేందుకు ప్రతి రోజూ ధ్యానం చేయడం ఆరంభించారు. ఏ రోజు కూడా ఆమె బ్రహ్మకుమారి సెంటర్కు ఆలస్యంగా వెళ్లలేదట. ముర్ము తన వద్ద ఎప్పుడూ శివుడి పుస్తకాన్ని దగ్గర పెట్టుకునేది. మరో ప్రదేశానికి వెళ్లినా.. ధ్యానం చెదిరిపోకుండా ఉండేందుకు ఆమె ఆ శివుడి పుస్తకాన్ని పట్టుకెళ్లేదట. ముర్ము ప్రతి రోజు తెల్లవారుజామున 3.30 గంటలకు నిద్ర లేస్తారట. ధ్యానం, యోగా చేసేందుకు ప్రతి రోజు ఉదయమే ఆమె నిద్ర లేస్తారు.