న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక సూచన చేసింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకోవాలని, జగడాలు వద్దని సూచించింది. కరువు సహాయ నిధులు విడుదల చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ కర్ణాటక సర్కారు దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.