న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అమేథీ స్థానాన్ని వీడి ఆయన.. రాయ్బరేలీ నుంచి పోటీకి సిద్ధం అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఇవాళ జరిగిన ఓ సభలో మాట్లాడుతూ రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చారు. బెంగాల్లో జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ.. ఓడిపోతానన్న భయంతోనే రాహుల్ గాంధీ అమేథీ స్థానాన్ని విడిచి వెళ్లినట్లు ప్రధాని ఆరోపించారు. ఇవాళ రాహుల్కు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని, డరో మత్.. భాగో మత్ అని ప్రధాని అన్నారు. భయపడవద్దు.. పారిపోవద్దు అని మోదీ పేర్కొన్నారు.
ఇటీవల బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారును రాహుల్ పదేపదే విమర్శించారు. ఈడీ, సీబీఐ లాంటి సంస్థలతో దాడు చేస్తున్నట్లు ఆయన ఆరోపిస్తూ.. ఎవరూ భయపడవద్దు అంటూ పేర్కొన్నారు. అయితే రాహుల్ చేసిన ఆ వ్యాఖ్యలను ఇప్పుడు ఆయనకే ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ విమర్శలు చేశారు. సోనియా గాంధీని కూడా ఆయన వదల్లేదు. తల్లీకొడుకులు ఇద్దరూ తమ స్థానాన్ని వదలివేసి పారిపోయినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆ పార్టీకి చెందిన పెద్ద నేత కూడా పోటీ చేయదని చెప్పానని, ఆమె భయంతో పారిపోయారని, రాజస్థాన్కు వెళ్లి రాజ్యసభ నుంచి పోటీ చేశారని మోదీ అన్నారు.
వయనాడ్లో కూడా రాహుల్ ఓటమి ఖరారు అవుతుందని, ఓటింగ్ ముగిసిన తర్వాత రాహుల్ మూడవ సీటు గురించి ప్రయత్నం మొదలుపెడుతారని, అమేథీలో ఓటమి భయం వల్ల.. రాయ్బరేలీకి వెళ్లారని, భయపడవద్దు అంటూ దేశం అంతా తిరుగుతూ చెబుతున్న ఆ నేతలకు తానో విషయాన్ని చెప్పాలని భావిస్తున్నానని, మీరెవరూ భయపడవద్దు అని, ఎవరూ పారిపోవద్దు అని కాంగ్రెస్ నేతకు మోదీ కౌంటర్ ఇచ్చారు.
#WATCH | Bardhaman-Durgapur, West Bengal: On Congress MP Rahul Gandhi’s candidature from Raebareli, PM Modi says, “I had already said in the Parliament that their (Congress) biggest leader will not dare to fight elections and she will run away. She ran away to Rajasthan and came… pic.twitter.com/xKNnGtpq6q
— ANI (@ANI) May 3, 2024