అహ్మద్నగర్ : భక్తుల నుంచి విరాళాల రూపంలో అందిన 155 కేజీల బంగారం, 6 వేల కేజీల వెండిని కరిగించి భక్తుల కోసం మెడలో వేసుకొనే డాలర్స్(మెడల్స్), నాణేలు తయారు చేసేందుకు మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సిద్ధమైంది. ప్రభుత్వ అనుమతి కోరింది. భక్తులు ఇప్పటి వరకు సాయిబాబా ఆలయానికి విరాళాల రూపంలో 450 కేజీల బంగారం, 6 వేల కేజీల వెండి అందించారు. ప్రస్తుతం ఇదంతా ట్రస్ట్ ఖజానాలో ఉన్నది.