Xiaomi | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: స్మార్ట్ఫోన్లకు లిక్విడ్ యూవీ స్క్రీన్ ప్రొటెక్టర్లను వాడొద్దని ప్రముఖ మొబైల్ఫోన్ తయారీ సంస్థ ‘షావోమీ’ వినియోగదారులకు సూచించింది. వాటిల్లో ద్రవరూపంలో ఉండే రసాయన జిగురు స్మార్ట్ఫోన్ చార్జింగ్ పోర్ట్, స్పీకర్, ఇతర భాగాల్లోకి వెళ్లి.. ఫోన్ పనితీరును దెబ్బతీస్తుందని హెచ్చరించింది. దీంతో పరికరం వారంటీ పూర్తి కాలం రాదని తెలిపింది.
ఈ మేరకు కంపెనీ తాజాగా వినియోగదారుల కోసం ఓ అడ్వైజరీ విడుదల చేసింది. లిక్విడ్ యూవీ ప్రొటెక్టర్స్ కాకుండా, టెంపర్డ్, నాన్-టెంపెర్డ్ గ్లాస్, ఎలక్ట్రోస్టాటిక్ ఫిల్మ్స్ను వాడొచ్చుని, స్మార్ట్ఫోన్ల పనితీరుకు, వాటి లైఫ్టైమ్కు సురక్షితమని పేర్కొన్నది.