న్యూఢిల్లీ: ఆన్లైన్ పందేలు, జూదం నిర్వహించే వేదికల ప్రకటనలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ప్రకటనలు ఇకపై ప్రచురణ/ప్రసారం చేయవద్దంటూ మీడియా సంస్థలను హెచ్చరించింది. దేశంలోని అన్ని టీవీ చానళ్లు, వార్తాపత్రికలు, డిజిటల్ మీడియా, సామాజిక మాధ్యమ సంస్థలకు కేంద్రం శుక్రవారం ఈ మేరకు అడ్వైజరీ జారీ చేసింది.