Kanimozhi : కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తోందని డీఎంకే నేత కనిమొళి మోదీ సర్కార్పై సోమవారం విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వ తీరుతో ముఖ్యంగా చిన్నతరహా పరిశ్రమలు ఛిద్రం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్రంలో ఏర్పాటయ్యే తదుపరి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని, మతం పేరుతో పాలన చేపట్టరాదని ఆమె అన్నారు. రానున్న లోక్సభ ఎన్నికలు కీలకమైనవని, మోదీ సర్కార్ ప్రజల గోడును పట్టించుకోవడం లేదని ఆమె దుయ్యబట్టారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తోందని, మీడియాను తన గుప్పిట్లో ఉంచుకుంటోందని కనిమొళి ఆరోపించారు.
జీఎస్టీని ప్రవేశపెట్టిన కేంద్రం చిన్నతరహా పరిశ్రమలను విస్మరించడంతో అవి సమస్యలను ఎదుర్కొంటున్నాయని మండిపడ్డారు. తాము లేవనెత్తే ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
Read More :
Drugs | గచ్చిబౌలి రాడిసన్ హోటల్లో డ్రగ్స్ సీజ్.. బీజేపీ నేత కుమారుడు అరెస్ట్!