హైదరాబాద్: హైదరాబాద్లో మరోసారి పెద్దమొత్తంలో డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. గచ్చిబౌలిలోని రాడిసన్ (Radisson Hotel)హోట్ల్లో ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నాయకుడి కుమారుడితో సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి రాడిసన్ హోటల్లో బీజేపీ నేత కుమారుడు కొందరికి విందు ఏర్పాటు చేశాడు. ఈ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నట్లు గుర్తించిన పోలీసులు దాడి చేసి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో బీజేపీ నేత కుమారుడు సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ ముగ్గురు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఉన్నారు.