DK Shivakumar : కర్నాటక అసెంబ్లీలో పాకిస్తాన్ అనుకూల నినాదాల వ్యవహారంలో కాషాయ పార్టీ లక్ష్యంగా కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విమర్శలు గుప్పించారు. మాండ్యలో బీజేపీ కార్యకర్తలు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారని, ఇది రికార్డుల్లో స్పష్టంగా ఉండగా దీన్ని మరుగుపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.
మాండ్య కేసుపై అప్పటి బీజేపీ ప్రభుత్వం సరైన విచారణ జరపలేదని అన్నారు. ఈ కేసులో బీజేపీ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్లు చేయలేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై దృష్టి సారించారని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని డీకే శివకుమార్ పేర్కొన్నారు.
కాగా 2022లో మాండ్య జిల్లాలో జరిగిన ఓ నిరసన ర్యాలీలో పాక్ అనుకూల నినాదాలు చేసినందుకు బీజేపీ కార్యకర్తను కర్నాటక పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. గత వారం రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి విజయం అనంతరం కర్నాటక అసెంబ్లీలో పాక్ అనుకూల నినాదాలు చేసిన కేసులో పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన అనంతరం బీజేపీ కార్యకర్త అరెస్ట్ కావడం గమనార్హం.
Read More :
Alians | మూడు వేల ఏండ్ల కిందటి భూమి ఏలియన్స్కు ఇప్పుడు కనిపిస్తుంది..!