Ditwa Cyclone : మరో తుఫాన్ ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో నైరుతి దిశలో ఏర్పడిన దిత్వా తుపాను (Ditwa Cyclone) నవంబర్ నెలాఖరున తీరం దాటనుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో ఈ తుఫాన్ నవంబర్ 30న తీరం దాటుతుందని.. ఫలితంగా ఈ రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతాయని గురువారం భారత వాతావరణ శాఖ(IMD) తెలిపింది. ఈ తుఫాన్ ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వానలు, ఈదురు గాలులు సంభవిస్తాయని ఐఎండీ పేర్కొంది.
శ్రీలంకలోని పొట్టువిల్ ప్రాంతంలో దిత్వా తుఫాన్ కేంద్రం ఏర్పడింది. ఇది బట్టికలోవకు దక్షిణంలో 90 కిలోమీటర్లు.. దక్షిణ చెన్నైకి 700 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారత వాతావరణ కేంద్రం ప్రకారం దిత్వా తుఫాన్ ఉత్తర, ఆగ్నేయం దిశగా పయనిస్తుందని నవంబర్ 30న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో తీరం దాటుతుంది.
Cyclone Ditwah formed over the SW Bay of Bengal near 6.9°N/81.9°E at 1130 IST today. It lay close to Pottuvil, ~90 km SSE of Batticaloa and ~700 km SSE of Chennai. The system will move NNW and reach off North Tamil Nadu–Puducherry–south AP coasts by early 30 Nov. pic.twitter.com/I8sQbCqbk7
— India Meteorological Department (@Indiametdept) November 27, 2025