భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హరియాణాలోని నుహ్లో మాదిరిగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ (Digvijay Singh) ఆరోపించారు. నుహ్లో మాదిరి మధ్యప్రదేశ్లోనూ అల్లర్లకు కాషాయ పార్టీ ప్రణాళిక రూపొందించిందని అన్నారు.
ఎన్నికలకు ముందు రాజకీయ లబ్ధి కోసం బీజేపీ దిగజారుడు రాజకీయాలకు తెరలేపుతుందని దిగ్విజయ్ సింగ్ దుయ్యబట్టారు. ఎంపీ ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరగనుండగా దిగ్విజయ్ వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారం రేపాయి. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలను కాషాయ పార్టీ నేతలు తిప్పికొట్టారు.
మరోవైపు ఏడాది చివరిలో జరగనున్న మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్ అసెంబ్లీ ఎన్నికలకు పలువురు అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాలను ఇటీవల ప్రకటించింది. మధ్యప్రదేశ్లో 39 మంది అభ్యర్ధులతో కాషాయ పార్టీ తన తొలి జాబితాను ప్రకటించింది. పార్టీ బలహీనంగా ఉన్న స్ధానాల్లో వ్యూహాత్మకంగా అభ్యర్ధులను బీజేపీ ముందుగా ప్రకటించింది. 230 అసెంబ్లీ స్ధానాలున్న మధ్యప్రదేశ్లో పాలక బీజేపీ కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది.
Read More :
Rahul Gandhi | చైనా దురాక్రమణపై మోదీ అసత్యాలు : రాహుల్ గాంధీ