లండన్, ఏప్రిల్ 9: నిద్రలేమి టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. నిద్ర సమస్యలు అరుదుగా ఉండేవారి కంటే.. నిద్రలోకి జారుకోవడంలో ఇబ్బంది పడేవారు లేదా సరిగా నిద్రపోకుండా ఉండేవారి రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయని తెలిపింది. యూకేలో 3,36,999 మందిపై శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వహించారు. సరిపడా లేని నిద్ర అధిక బ్లడ్ షుగర్ లెవల్స్కు కారణమౌతుందని, ఇది మనిషి శరీరంలో టైప్ 2 డయాబెటిస్ను వృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని గుర్తించారు. మధుమేహ ముప్పును నివారించాలంటే, నిద్రలేమిని తగ్గించే చర్యలు అవసరమని శాస్త్రవేత్తలు చెప్పారు.