ఎయిర్లైన్స్కు డీజీసీఏ ఆదేశం
న్యూఢిల్లీ, జూన్ 8: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికులందరూ మాస్కు ధరించేలా చూడాలని, మాస్కు పెట్టుకోని వారిని విమానం నుంచి దింపేయాలని సూచించింది.
మాస్కు ధరించేందుకు విముఖత వ్యక్తం చేసినా.. హెచ్చరించినా కూడా పాటించకుంటే ఆ ప్రయాణికుడ్ని విమానం బయలుదేరకముందే కచ్చితంగా దింపేయాలని పేర్కొన్నది. అవసరమైతే స్థానిక పోలీసులు, సెక్యూరిటీ ఏజెన్సీల సహాయం తీసుకోవాలని, వీలైతే మాస్కు ధరించని సదరు ప్రయాణికులపై జరిమానా వేయాలని పేర్కొంటూ డీజీసీఏ ఓ సర్క్యులర్ జారీ చేసింది.