న్యూఢిల్లీ: సమాజంలో ఏ ఒక్కరూ వెనుకబడకూడదన్నదే రాజ్యాంగకర్తల లక్ష్యమని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. నవ భారత నిర్మాణంలో రాజ్యాంగం కీలక పాత్ర పోషించిందని చెప్పారు. రాజ్యాంగ దినోత్సవం (Constitution day) సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి మాట్లాడారు. రాజ్యాంగ రూపకర్తలకు నివాళర్పిస్తున్నాని చెప్పారు. రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న నవంబర్ 26 చారిత్రక దినం అని తెలిపారు.
ప్రజాస్వామ్య దేశ తత్వాన్ని రాజ్యాంగ పీఠిక ప్రతిబింబించిందని చెప్పారు. ప్రజా సంక్షేమమే కేంద్రంగా అభివృద్ధి జరగాలని సూచించారు. భారతీయులంతా ఒక్కటే.. ఒకరి కోసం అందరం ఉన్నామని చెప్పారు. సవాళ్లకు అనుగుణంగా మార్చుకునే స్వభావం మన రాజ్యాంగానికి ఉందన్నారు. సురక్షిత, సుశిక్షిత, స్వాస్థ్య భారత్ మనందరి లక్ష్యం కావాలన్నారు.