డబ్బా కొట్టుకోవడంలో ప్రధాని ముందు: జైరాం రమేశ్
న్యూఢిల్లీ, జూన్ 5: అభివృద్ధి చెందిన దేశాల నుంచే కర్బన ఉద్గారాలు ఎక్కువగా వెలువడుతున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. వాతావరణ మార్పులకు ఆ దేశాలే ప్రధాన కారణమని తెలిపారు. వాతావరణ మార్పుల్లో భారత్ పాత్ర చాలా చిన్నదని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం స్వచ్ఛభారత్, నమామీ గంగే లాంటి ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నామని వెల్లడించారు.
మరోవైపు పర్యావరణ, అటవీ చట్టాలను ప్రధాని మోదీ నీరుగార్చారని, కానీ ప్రపంచవేదికలపై మాత్రం తానే పర్యావరణ పరిరక్షుడినంటూ సొంత డబ్బా కొట్టుకుంటున్నారని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శించారు.