న్యూఢిల్లీ, డిసెంబర్ 14: అరుణాచల్ప్రదేశ్ సరిహద్దులో భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణపై పార్లమెంట్లో చర్చ జరపకపోవటాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్రంగా ఖండించారు. 1962లో చైనాతో యుద్ధం జరిగినా, నాటి ప్రధాని జవహర్లాల్నెహ్రూ సభలో చర్చ చేపట్టారని గుర్తుచేశారు. ఆనాడు దాదాపు 100 మంది ఎంపీలు మాట్లాడారని, చర్చలు జరిపారని చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటివే కావాలని అన్నారు. కానీ, ప్రస్తుతం కేంద్రంలోని మోదీ సర్కారు సరిహద్దు వివాదంపై చర్చ చేపట్టడం లేదని విమర్శించారు.