న్యూఢిల్లీ : ప్రముఖ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రాకు (Rahul Mishra) ఫ్రాన్స్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఫ్యాషన్ పరిశ్రమకు అందించిన సేవలకు గాను మిశ్రాకు చెవలియర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ అవార్డును ఫ్రాన్స్ అందచేసింది. కళలు, సాంస్కృతిక రంగాల్లో కృషి చేసిన వ్యక్తులకు ఈ అవార్డులు బహుకరిస్తారు.
గతంలో చాలా కొద్దిమంది సెలబ్రిటీలను చెవలియర్ అవార్డు వరించడంతో మిశ్రాకు ఈ అవార్డు దక్కడం భారతీయులకు గర్వకారణం. నటుడు కమల్ హాసన్, ఫిల్మ్ మేకర్ గునీత్ మోంగా గతంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్నారు.
ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక చెవలియర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ అవార్డును స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నానని, తనను గుర్తించి గౌరవించిన రాయబారి ఇమ్మానుయేల్ లెనయిన్, అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్లకు ధన్యవాదాలు తెలుపుతున్నానని మిశ్రా ఇన్స్టాగ్రాం పోస్ట్లో రాసుకొచ్చారు.
Read More :