న్యూఢిల్లీ: గుజరాత్లోని ప్రఖ్యాత సోమనాథ్ ఆలయం ఆవరణలోని పలు ఇండ్లు, వందలాది గుడిసెలు, తాత్కాలిక నిర్మాణాలపైకి ఆ రాష్ట్రంలోని బీజేపీ సర్కార్ బుల్డోజర్లను పంపింది. అక్రమ నిర్మాణాలుగా పేర్కొంటూ 21 ఇండ్లు, 153 తాత్కాలిక నిర్మాణాలు, గుడిసెల్ని జిల్లా ప్రభుత్వ యంత్రాంగం శనివారంనాడు కూల్చివేసింది.
గిర్ సోమనాథ్ జిల్లాలో టస్ట్కు చెందిన 7.4 ఎకరాల భూమి ఆక్రమణలకు గురైందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు కూల్చివేత చేపట్టామని కలెక్టర్ హార్జి చెప్పారు.