న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి లంచం, అవినీతి ఆరోపణలపై సుప్రీంకోర్టు మరింత స్పష్టతనిచ్చింది. లంచాన్ని నేరుగా తీసుకోకపోయినా, మరొక ప్రభుత్వ ఉద్యోగి ద్వారా చేసినా, తన హోదాను ఉపయోగించి కింది ఉద్యోగుల్ని ప్రభావితం చేసినట్టు దర్యాప్తులో తేలితే.. లంచం కేసులో సదరు ఉద్యోగి దోషిగా పరిగణించాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. లంచాలు ఇప్పించే ప్రక్రియను తెరవెనుక నడిపించినా.. నేరానికి బాధ్యత వహించాల్సిందేని పేర్కొన్నది. వ్యక్తిగత పలుకుబడి ఉపయోగించినా నేరానికి పాల్పడినట్టేనని తెలిపింది. తన కోసం కాకపోయినా.. వేరొకరికి అక్రమ ప్రయోజనాన్ని సమకూర్చే ఉద్దేశంతో లంచం డిమాండ్ చేసినా లేదా పొందడానికి ప్రయత్నించినా.. అది నేరమే అవుతుందని ఓ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.