న్యూఢిల్లీ: హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది జావేద్ అహ్మద్ మట్టుకు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు 7 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. శుక్రవారం ఉదయం ఢిల్లీ స్పెషల్ పోలీసులు జావేద్ అహ్మద్ మట్టును అరెస్ట్ చేశారు. అనంతరం పాటియాలా హౌస్ కోర్టులో న్యాయవాది ముందు అతడిని ప్రవేశపెట్టారు.
దాంతో పాటియాలా హౌస్కోర్టు జావేద్ అహ్మద్ను 7 రోజులపాటు ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసుల కస్టడీకి అప్పగించింది. జమ్ముకశ్మీర్లో జరిగిన పలు ఉగ్రవాద దాడుల వెనుక జావేద్ అహ్మద్ మట్టు హస్తం ఉన్నది. ఆయా ఉగ్రదాడులకు సంబంధించి మట్టుపై పలు కేసులు ఉన్నాయి.
#WATCH | Delhi | Hizbul Mujahideen operative Javed Mattu produced before the Patiala House Court after his arrest by the Special Cell of Delhi police.
He is allegedly involved in multiple cases of terror attacks in Jammu and Kashmir. pic.twitter.com/M2tr0VY5Ss
— ANI (@ANI) January 5, 2024