న్యూఢిల్లీ : బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ పఠాన్ మూవీ బాక్సాఫీస్ వసూళ్లలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుండగా ఈ సినిమాలోని పాటలకు సోషల్ మీడియాలో పలువురు క్రేజీ స్టెప్స్తో సందడి చేస్తున్నారు. రీక్రియేట్ వీడియోలతో దుమ్మురేపుతున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని జీసస్ అండ్ మేరీ కాలేజ్లోని కామర్స్ డిపార్ట్మెంట్కు చెందిన ప్రొఫెసర్లు పఠాన్లోని ఝూమే జో పఠాన్ సాంగ్కు స్టూడెంట్స్తో కలిసి కిల్లర్ మూమెంట్స్తో ఆకట్టుకున్నారు.
ఈ వైరల్ వీడియోను జేఎంసీ, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఇన్స్టాగ్రాంలో షేర్ చేసింది. కాలేజ్ యాంపీథియేటర్లో స్టూడెంట్స్ ఝూమే జో పఠాన్ సాంగ్కు స్టెప్పులేస్తుండటంతో ఈ క్లిప్ మొదలవగా కొద్ది క్షణాల్లోనే శారీస్లో ముస్తాబైన ప్రొఫెసర్లు స్టూడెంట్స్తో కలిసి స్టైలిష్ స్టెప్పులతో అదరగొట్టారు. హుషారైన సాంగ్కు ప్రొఫెసర్లు స్టైలిష్ స్టెప్స్తో ఆకట్టుకున్నారు.
ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి పది లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. ప్రొఫెసర్ల డ్యాన్స్ పెర్ఫామెన్స్తో ఇన్స్టాగ్రాం యూజర్లు ఫిదా అయ్యారు. ఇలాంటి ప్రొఫెసర్లు అవసరమని కొందరు యూజర్లు కోరుకోగా, క్రేజీ అని మరో యూజర్ కామెంట్ చేశారు.