న్యూఢిల్లీ, డిసెంబర్ 22: గగనతలంలో ఎయిరిండియా విమానానికి అత్యవసర పరిస్థితి ఎదురైంది. సాంకేతికలోపం కారణంగా ఇంజిన్ ఆయిల్ ప్రెజర్ జీరోకి పడిపోయింది. ఢిల్లీ నుంచి ముంబయికి బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన వెంటనే పైలట్ ఈ లోపాన్ని గుర్తించారు. సోమవారం ఉదయం 3.20 గంటల సమయంలో ఎయిరిండియా బోయింగ్ విమానం టేకాఫ్ అయ్యింది.
ఆ వెంటనే కుడివైపు ఇంజిన్ ఆయిల్ ప్రెజర్ అసాధారణంగా తగ్గిపోవడాన్ని పైలట్ గుర్తించారు. తర్వాత అది జీరోకు పడిపోయింది. దాంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించారు. టేకాఫ్ అయినచోటే సురక్షితంగా ల్యాండ్ చేశారు.