Bomb Threats | దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు (Bomb Threats) కలకలం రేపాయి. శుక్రవారం దాదాపు 30 పాఠశాలలకు (Delhi Schools) బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం ఉదయం కూడా పలు స్కూళ్లకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
ఆర్కేపురం, వసంత్ కుంజ్ ప్రాంతాల్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సహా పలు పాఠశాలలు బెదిరింపులు వచ్చాయి. శనివారం ఉదయం 6:12 గంటల ప్రాంతంలో బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఆయా పాఠశాలల యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు పాఠశాలల వద్దకు చేరుకొని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో పాఠశాలల ఆవరణల్లో తనిఖీలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ లభించలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, సూళ్లలో బాంబులు ఉన్నాయంటూ బెదిరింపులు రావడంతో ఈ వారంలో ఇది మూడోసారి కావడం గమనార్హం. వరుస బెదిరింపులతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Also Read..
LK Advani | ఎల్కే అద్వానీకి మళ్లీ అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
Allu Arjun: అండర్ ట్రయల్ 7697.. మంజీరా బరాక్లో అల్లు అర్జున్
Whale | ఆడ తోడు కోసం మూడు సముద్రాలు దాటి! 19 వేల కి.మీ. వలస వెళ్లిన తిమింగలం