న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఓటు వేయకపోతే ఎన్నికల కమిషన్ (EC) రూ.350 జరిమానా విధించనుందనే వార్త సోషల్ మీడియాలో షికారుచేస్తున్నది. ఈ పుకారుపై (Fake news) ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఓటు వేయనివారి బ్యాంకు ఖాతాల నుంచి ఈసీ రూ.350 కట్చేస్తుందనే వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
కాగా, ఇవన్నీ పుకార్లని స్వయంగా ఈసీ ప్రకటించినప్పటికీ సోషల్ మీడియాలో ఈ అసత్య ప్రచారానికి తెరపడలేదు. దీంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ విభాగం (IFSO) దర్యాప్తు చేస్తున్నదని తెలిపారు.