Covid-19 | కరోనా మహమ్మారి కలవరానికి గురి చేస్తున్నది. దేశంలో మళ్లీ కేసులు పెరుగుతుండడం సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఏడుగురికి కరోనా పాజిటివ్గా తేలింది. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా కొవిడ్ వేరియంట్ జేఎన్.1 కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ సూచించింది. కొవిడ్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఆసుపత్రుల్లో 6,157 పడకలు ఉన్నాయని పేర్కొంది. ఇందులో ఏడుగురు అడ్మిట్ అయ్యారని పేర్కొంది. ఇంకా 6150 పడకలు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది.
ఆరోగ్యశాఖ విడుదల చేసిన డేటా ప్రకారం దేశ రాజధానిలో 20,14,448 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా.. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని సూచించింది. రద్దీగా ఉండే ప్రాంతాలకు ధరించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. క్రిస్మస్, జనవరి ఒకటి నూతన సంవత్సర వేడుకలతో మరిన్ని కేసులు పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాదాపు ఏడు నెలల తర్వాత ఘజియాబాద్లో తొలి కొవిడ్ కేసు నమోదయ్యింది. ప్రైవేట్ ల్యాబ్లో కొవిడ్ పాజిటివ్గా తేలింది. జిల్లా సర్వైలెన్స్ అధికారి ఆర్కే గుప్తా మాట్లాడుతూ రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.