Guinness World Record | ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి అరుదైన రికార్డు సృష్టించాడు. అతితక్కువ సమయంలో దేశరాజధాని ఢిల్లీ (Delhi)లోని అన్ని మెట్రో స్టేషన్లను (Metro Stations) కవర్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు (Guinness World Record)లో చోటు సంపాదించుకున్నాడు.
ఫ్రీలాన్స్ పరిశోధకుడిగా పనిచేస్తున్న శశాంక్ మను (Shashank Manu).. ఏప్రిల్ 2021లో ఈ ఘనత సాధించాడు. 15 గంటల 22 నిమిషాల 49 సెకన్లలో ఢిల్లీలోని అన్ని మెట్రో స్టేషన్లను కవర్ చేశాడు. ముందుగా ఢిల్లీ మెట్రో గ్రీన్ లైన్ లో ఉన్న బ్రిగేడియర్ హోసియార్ సింగ్ స్టేషన్ లో తెల్లవారుజామున 5 గంటలకు తన ప్రయాణాన్ని ప్రారంభించిన మను.. అదే రోజు రాత్రి 8:30 గంటలకు అదే స్టేషన్ లో తన ప్రయాణాన్ని ముగించాడు. అయితే చిన్న అపార్థం కారణంగా జీడబ్ల్యూఆర్ (Guinness World Record) నుంచి తన అధికారిక గుర్తింపును పొందలేకపోయాడు.
దీంతో, మను తర్వాత ఆగస్టు 29, 2021లో ఢిల్లీలోని అన్ని మెట్రో స్టేషన్లను 16 గంటల 2 నిమిషాల్లో కవర్ చేసిన ప్రఫుల్ సింగ్ కు గుర్తింపు దక్కింది. అంతకు ముందే ఏప్రిల్ 14న మను ఈ రికార్డును బద్దలు కొట్టినట్లు తర్వాత వెల్లడైంది. దీంతో తాజాగా అతనికి గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మను ఏప్రిల్ 2023లో ట్వీట్ చేశాడు. ‘ఇప్పుడే అందింది. అన్ని ఢిల్లీ మెట్రో స్టేషన్లను అత్యంత వేగంగా సందర్శించినందుకు గానూ నాకు గిన్నిస్ రికార్డ్ నుంచి సర్టిఫికేట్ వచ్చింది’ అంటూ సంతోషంగా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
కాగా, ఢిల్లీ మెట్రో నెట్ వర్క్ 391 కిలోమీటర్లు (నోయిడా- గ్రేటర్ నోయిడా ఆక్వాలైన్, గురుగ్రామ్ లోని రాపిడ్ మెట్రోతో సహా) విస్తరించి ఉంది. మొత్తం 12 లైన్లు, 286 స్టాప్ లను కలిగి ఉంది.
Hey @GWR look what just arrived, the certificate for my Guinness record of visiting all Delhi Metro stations in fastest time!
Also the news of my record was prominently covered by many media outlets in India. THANK YOU! pic.twitter.com/ciIgb77ngg
— Shashank Manu (@sskmnu) April 4, 2023
Also Read..
Keerthy Suresh | కీర్తి సురేశ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతోందా..? వైరలవుతున్న నటి కామెంట్స్
Captain Cool | కెప్టెన్ కూల్ ధోనీ కాదట.. ఎవరో చెప్పిన గవాస్కర్
Maharashtra | బీఫ్ మాంసం తరలిస్తున్నారన్న అనుమానంతో.. ముస్లిం వ్యక్తిని కొట్టి చంపిన గోసంరక్షకులు