Manish Sisodia | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయిన మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కష్టాలు తగ్గడం లేదు. మనీలాండరింగ్ కేసులో మనీష్ సిసోడియా బెయిల్పై నిర్ణయాన్ని కోర్టు వాయిదా వేసింది. సిసోడియా బెయిల్ పిటిషన్పై నిర్ణయాన్ని రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది. ఇంతకుముందు ఈ నెల 18న విచారణను పూర్తి చేసిన కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ బుధవారం తీర్పును వెలువరించాల్సి ఉండగా.. వాయిదా వేశారు. సిసోడియా ప్రస్తుతం సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. సీబీఐ కేసులో ప్రత్యేక న్యాయమూర్తి మార్చి 31న ఆయనకు బెయిల్ నిరాకరించారు. ఆయన బెయిల్ పిటిషన్ ఢిల్లీ హైకోర్టులో పెండింగ్లో ఉంది.