న్యూఢిల్లీ : ఆప్ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా నిందితులుగా ఉన్న ఢిల్లీ మద్యం పాలసీ కేసును ఢిల్లీ హైకోర్టులో జస్టిస్ మనోజ్ జైన్ విచారించనున్నారు. ఈ కేసు విచారణ నుంచి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తప్పు కోవడంతో ఆయనకు ఈ కేసును కేటాయించడం అనివార్యమైంది. ఢిల్లీ ప్రభుత్వ మద్యం పాలసీని తమకు అనుకూలంగా రూపొందించినందుకు కేజ్రీవాల్, సిసోడియాకు మద్యం వ్యాపారులు ముడుపులు ఇచ్చారని ఆరోపిస్తూ 2022లో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ఇటీవల ఈ కేసు విచారణ చేపట్టిన జస్టిస్ స్వర్ణ కాంత శర్మ కూతురు, కొడుకు కేంద్ర ప్రభుత్వ ప్యానెల్ కౌన్సెల్లో సభ్యులుగా ఉన్నారని కేజ్రీవాల్ అభ్యంతరం తెలిపారు. అలాగే జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తమ పార్టీ భావజాలాన్ని వ్యతిరేకించే ఏబీవీపీ సదస్సులకు హాజరయ్యారని.. అందువల్ల ఆమె తన కేసును విచారించకూడదని ఆయన వాదించారు. తొలుత ఆయన వాదనను వ్యతిరేకించినా.. ఆ తర్వాత కేసు విచారణ నుంచి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తప్పుకొన్నారు.