చండీగఢ్: పంజాబ్, హర్యానా రైతులు మళ్లీ నిరసనకు దిగుతున్నారు. (farmers’ stir) వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన భారీ నిరసనకు మూడేళ్లైన సందర్భంగా ఆ తరహా ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. రైతులు పెద్ద సంఖ్యలో చండీగఢ్కు తరలివెళ్తున్నారు. పెండింగ్లో ఉన్న డిమాండ్ల కోసం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) మూడు రోజుల నిరసనకు పిలుపునిచ్చింది. దీంతో రైతులు వందలాది ట్రాక్టర్ ట్రాలీల్లో చండీగఢ్కు ప్రయాణమయ్యారు. మొహాలీలోని గురుద్వారా అంబ్ సాహిబ్ వద్దకు వారంతా చేరనున్నారు. సోమవారం భారీ ర్యాలీగా అక్కడి నుంచి చండీగఢ్కు వెళ్లనున్నారు. మూడు రోజుల నిరసన తర్వాత తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని పంజాబ్ గవర్నర్, ఆ రాష్ట్ర సీఎంకు సమర్పించనున్నారు.
మరోవైపు రైతులు చండీగఢ్లోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. పంజాబ్, చండీగఢ్, హర్యానా సరిహద్దులను ఆయా రాష్ట్రాల పోలీసులు మూసివేశారు. కాగా, రెండేళ్ల కిందట రైతులు చేపట్టిన చారిత్రక నిరసన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో చండీగఢ్లో నిరసన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.