లక్నో: ఇంటి పైకప్పు కూలడంతో ఐదుగురు కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగానే చనిపోయారు. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఒక ఇంట్లో భార్యాభర్తలు, ముగ్గురు పిల్లలు నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి భోజనాల అనంతరం నిద్రపోయారు. బుధవాం తెల్లవారుజామున వారి ఇంటి పైకప్పు కూలిపోయింది. దీంతో ఆ కుటుంబంలోని ఐదుగురు నిద్రలోనే మరణించారు.
విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. ముగ్గురు పిల్లలు, వారి తల్లి మృతదేహాలను వెలికితీశారు. శిథిలాల్లో ఉన్న మరో వ్యక్తి మృతదేహం వెలికితీసే పనులు చేపట్టినట్లు జిల్లా మేజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ లక్కర్ తెలిపారు.