న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలపై నమోదైన 17 కేసులను ఉపసంహరించడానికి ఢిల్లీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో గణతంత్ర దినోత్సవం రోజు జరిగిన హింసాకాండ కేసు కూడా ఉన్నది. మొత్తం 54 కేసుల్లో 17 కేసుల ఉపసంహరణకు ఇటు ప్రభుత్వం నుంచి, అటు లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి ఆమోదం లభించింది.