న్యూఢిల్లీ, ఆగస్టు 24: జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యమిస్తున్న సందర్భంగా.. రాజధాని న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు మూసివేస్తున్నామని కేంద్రం గురువారం ఓ ప్రకటన జారీచేసింది. షెడ్యూల్ ప్రకారం జీ20 సదస్సు సమావేశాలు సెప్టెంబర్ 9-10న ఢిల్లీ వేదికగా నిర్వహించబోతున్నారు.
సదస్సులో పాల్గొనేందుకు ఆయా దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల చీఫ్లు భారత్కు రాబోతున్నారు. సదస్సులోని కార్యక్రమాల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని, దేశాధినేతలు, వీవీఐపీల రవాణా సౌకర్యాన్ని పరిగణనలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్ని మూసి వుంచాలని నిర్ణయించినట్టు కేంద్రం తెలిపింది.