న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో అందరూ ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలోని పాఠశాలల్లో విద్యార్థులు కరోనా బారినపడుతుండడంతో మళ్లీ ఆందోళన మొదలైంది. పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య ఢిల్లీ ప్రభుత్వ మార్గదర్శకాఉల జారీ చేసింది. కరోనాకు సంబంధించి ఏమైనా సమాచారం స్కూల్ అథారిటీ దృష్టికి వస్తే డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదంటే సంబంధిత విభాగానికి అందించాలని ఆదేశించింది. అలాగే పాఠశాలలను కొద్ది రోజులు మూసివేయాలన్నది. ఇదే సమయంలో నియమాలను సైతం పాటించాలని సూచించింది.
విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది అంతా మాస్క్లు తప్పనిసరిగా ధరించాలని, సామాజిక దూరం పాటించాలని చెప్పింది. చేతులను సబ్బుతో శుభ్రంగా కడగాలని, శానిటైజర్లను వినియోగించాలని, ఈ విషయంలో ప్రలజకు అవగాహన కల్పించాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీతో పాటు ఘజియాబాద్, నోయిడాలోని కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కరోనా పాజిటివ్గా పరీక్షించారు. దీంతో పాఠశాలలను మూసివేసి, విద్యార్థులకు సెలవులు ప్రకటించారు. మరో వైపు విద్యార్థులు కొవిడ్ బారినపడుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.