Delhi Airport | దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు ఎమర్జెన్సీని ప్రకటించారు. ఇందులో భాగంగా అంబులెన్స్లు, అగ్నిమాపక దళం సిబ్బందిని సైతం మోహరించారు. విమానం టేకాఫ్ అయిన వెంటనే ఓ పక్షి ఢీకొట్టింది. ఈ క్రమంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయనున్నారు. ఫెడెక్స్ విమానం ఢిల్లీ నుంచి దుబాయికి వెళ్తున్న సమయంలో పక్షి ఢీకొట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా ఎయిర్పోర్ట్ అధికారులు ఎమర్జెన్సీని విధించినట్లు అధికారులు ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Full emergency declared at Delhi airport after Dubai bound FedEx aircraft suffers bird-hit soon after take-off: Airport official
— ANI (@ANI) April 1, 2023