పనాజీ: గోవా పర్యటనకు వెళ్లిన ఢిల్లీ కుటుంబంపై అక్కడి స్థానికులు కత్తులు, ఇతర మారణాయుధాలతో దాడి చేశారు. ( Attack On Delhi Family) ఈ సంఘటనలో పలువురు వ్యక్తులు గాయపడ్డారు. ఢిల్లీకి చెందిన 47 ఏళ్ల అశ్విని కుమార్ చంద్రాని తన కుటుంబ సభ్యులతో కలిసి మార్చి 5న గోవా వెళ్లారు. అంజునా ప్రాంతంలోని స్పాజియో లీజర్ రిసార్ట్లో వారు బస చేశారు. ఆ రిసార్ట్లో రిసెప్షనిస్ట్గా పని చేసే రాయిస్టన్ రెజినాల్డో డయాస్ అలియాస్ రోషన్తో స్వల్ప వాగ్వాదం జరిగింది. దీంతో వారు మేనేజర్కు ఫిర్యాదు చేయగా రోషన్ను పని నుంచి తొలగించారు. ఈ సంఘటన నేపథ్యంలో రోషన్ తన అనుచరులను ఆ రిసార్ట్ వద్దకు పిలిపించాడు. దీంతో బ్యాట్లు, కత్తులు వంటి మారణాయుధాలతో వారు అక్కడకు వచ్చారు. అశ్విని కుమార్, అతడి కుటుంబ సభ్యులపై దాడి చేశారు. కొందరిని కత్తులతో పొడిచారు. ఈ దాడిలో పలువురు స్వల్పంగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
కాగా, గోవా స్థానికులు తమపై దాడి చేయడంపై బాధిత ఢిల్లీ కుటుంబం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు పట్టించుకోలేదు. దీంతో వారు పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు రిసార్ట్లోని సీసీటీవీలో రికార్డైన దాడికి సంబంధించిన వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో గోవా సీఎం ప్రమోద్ సావంత్ దీనిపై స్పందించారు. ఈ సంఘటన షాకింగ్ అని, సహించరానిదని అన్నారు. శాంతి భద్రతలకు ముప్పుగా మారిన సంఘ విద్రోహులపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్విట్టర్లో పేర్కొన్నారు.
మరోవైపు గోవా పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఈ సంఘటనపై స్పందించారు. అంజునా ప్రాంత వాసులైన ప్రధాన నిందితుడు రోషన్, అతడి అనుచరులు నైరాన్ రెజినాల్డో డయాస్, జోసెఫ్ అలెక్స్ లోబో, కాశీనాథ్ విశ్వోర్ అగర్కడేకేను అరెస్ట్ చేశారు. దాడిలో పాల్గొన్న మిగతా నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ కేసు దర్యాప్తును మరో పోలీస్ అధికారికి అప్పగించినట్లు చెప్పారు. అలాగే కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించిన అంజునా ప్రాంత పోలీస్ స్టేషన్ అధికారిపై శాఖాపరమైన చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
Name of Assaulted -Jatin Sharma & Anil Sharma
Location – Anjuna North Goa#ViralVideo pic.twitter.com/DUkaVOVClA— Jacob Mathew (@Jacobmathewlive) March 12, 2023
Today’s violent incident in Anjuna is shocking and intolerable. I have directed the Police to take the harshest action against the perpetrators. Such anti-social elements are a threat to the peace and safety of the people in the State, and will be dealt with strictly.
— Dr. Pramod Sawant (@DrPramodPSawant) March 12, 2023