న్యూఢిల్లీ: 2020లో చోటుచేసుకున్న ఢిల్లీ అల్లర్లకు తీవ్ర కుట్రపన్నిన కేసులో నిందితుడిగా ఉన్న ఉమర్ ఖలీద్కు ఢిల్లీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల చివరి వారంలో ఉమర్ ఖలీద్ సోదరి వివాహం ఉండటంతో ఆ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఒక వారం వ్యవధికి మధ్యంతర బెయిల్ ఇచ్చారు.
ఖలీద్కు ఈ నెల 23న బెయిల్ మంజూరవుతుంది. సోదరి వివాహానికి హాజరై డిసెంబర్ 30న అతడు తిరిగి లొంగిపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నెల 23 లోపు ఉమర్ ఖలీద్ మధ్యంతర బెయిల్కు సంబంధించిన ఫార్మాలిటీస్ అధికారులు పూర్తిచేయనున్నారు.