న్యూఢిల్లీ, నవంబర్ 2: ఢిల్లీ మద్యం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరుకాలేదు. తనకు జారీ చేసిన సమన్లు రాజకీయ ప్రేరితంగా, అస్పష్టంగా, చట్ట విరుద్ధంగా ఉన్నందున వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని ఈడీకి రాసిన లేఖలో కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఆయన రాసిన లేఖను పరిశీలించిన ఈడీ.. విచారణకు త్వరలోనే మరో తేదీని నిర్ణయిస్తుందని భావిస్తున్నారు. కాగా, పంజాబ్ సీఎం భగవంత్ మాన్తో కలిసి కేజ్రీవాల్ గురువారం మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకోవడానికి బీజేపీ ప్రేరేపితంతో తనకు సమన్లు జారీ చేస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. పైగా తనకు పంపిన సమన్లు అస్పష్టంగా ఉన్నాయని, తనను సాక్షిగా పిలిచారా? లేక అనుమానితునిగానా? వ్యక్తిగత హోదాలోనా? ముఖ్యమంత్రి హోదాలోనా అన్న విషయాలు పేర్కొన లేదని విమర్శించారు. ‘కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తామని వారు రోజూ బెదిరిస్తున్నారు. మీరు కేజ్రీవాల్ను భౌతికంగా అరెస్ట్ చేయొచ్చు. కానీ కేజ్రీవాల్ ఆలోచనలను మీరు ఎలా అరెస్ట్ చేయగలరు?’ అని ఆయAnti Corruption Bureau arrests two ED Enforcement Officers for demanding bribeన ప్రశ్నించారు.