న్యూఢిల్లీ: ఢిల్లీలో బ్యూరోక్రాట్ల పోస్టింగ్, బదిలీలపై నియంత్రణ కోసం కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్కు (Ordinance) వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) వెళ్లనున్నారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్తో (Samajwadi Party chief Akhilesh Yadav) లక్నోలో భేటీ కానున్నారు. పంజాబ్ (Punjab) ముఖ్యమంత్రి భగవంత్మాన్తో (Bhagwant Mann) కలిసి అధికారుల బదిలీలు, పోస్టింగ్ల కోసం కేంద్రం జారీచేసిన ఆర్డినెన్స్కు వ్యతికంగా మద్దతు కోరనున్నారు.
ఆర్డినెన్స్ను రాజ్యసభలో అడ్డుకోవడంలో భాగంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, శివసేన (యూబిటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి శిబు సోరెన్తో భేటీ అయ్యారు.
ఢిల్లీలో అధికారుల పోస్టింగ్లు, బదిలీలపై ప్రజా ప్రభుత్వానికే పూర్తి అధికారం ఉంటుందని మే 11న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఇచ్చింది. అయితే మే 19న మోదీ సర్కార్ ఆ తీర్పును తుంగలో తొక్కి ఆర్డినెన్స్ తెచ్చింది. దీంతో ఆర్డినెన్స్ను రాజ్యసభలో అడ్డుకోవడానికి బీజేపీయేతర పార్టీల నాయకులకు కేజ్రీవాల్ కలుస్తూవస్తున్నారు.