న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, ఎల్జీ సృష్టిస్తున్న అడ్డంకులు, ఆటంకాల మధ్య ఢిల్లీ ప్రభుత్వాన్ని నడుపుతున్నందుకు తనకు నోబెల్ బహుమతి రావాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ‘వారు (బీజేపీని ఉద్దేశించి) ఢిల్లీలో దవాఖానలు, పాఠశాలల నిర్మాణాన్ని నిలిపివేయించడానికి ప్రయత్నిస్తారు.
పేద పిల్లలకు వారి పిల్లలకు అందే విద్యే అందాలని అనుకోరు. అలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎలా నడుపుతున్నానో నాకొక్కడికి మాత్రమే తెలుసు. దీనికి నాకు నోబెల్ బహుమతి రావాలి’ అంటూ కేజ్రీవాల్ అన్నారు.