అమృత్సర్: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్పై పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ తీవ్ర విమర్శలు చేశారు. కేజ్రివాల్ ఒక అబద్ధాలకోరు అని మండిపడ్డారు. ఆయన ఢిల్లీలో ధనవంతుల నుంచి అధికంగా ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, ఆ డబ్బుతో మురికివాడల్లో కరెంటు ఉచితంగా ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఈ విధమైన లాలీపాప్ను నువ్వు ఎన్ని రోజులు అందించగలవు..? అని కేజ్రివాల్ను ఉద్దేశించి ప్రశ్నించారు.
పంజాబ్లో ఇలాంటి లాలీపాప్ ఎత్తుగడలు పనిచేయవని సిద్ధూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్లో అధికారంపై దృష్టిపెట్టిన కేజ్రివాల్ తరచూ ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అక్కడి ప్రజలపై హమీల వర్షం కురిపిస్తున్నారు. అధికారంలోకి వస్తే పంజాబ్లో 300 యూనిట్లలోపు విద్యుత్ను వినియోగించే ప్రతి కుటుంబానికి ఉచితంగా కరెంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ కేజ్రివాల్పై విమర్శలు గుప్పించారు.