న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏడోసారి ఈడీ విచారణకు హాజరుకాలేదు. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున.. కోర్టు ఆదేశిస్తేనే విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు.
తనను ఇండియా కూటమిని వీడేలా ఒత్తిడి చేసేందుకే తాజా సమన్లు పంపించారని ఆయన ఆరోపించారు. అయినా తాను కూటమితో బంధాన్ని తెంచుకోనని తెగేసి చెప్పారు. తనకు జారీ చేసిన సమన్లపై ఈడీనే కోర్టుకు వెళ్లిందని.. మార్చి 16న విచారణ జరగనుందని.. కాబట్టి వరుసగా సమన్లు పంపే బదులు అప్పటి వరకు వేచి చూడాలని కేజ్రీవాల్ ఈడీకి సూచించారు.