న్యూఢిల్లీ: ఒక బిల్డింగ్లో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే అంతా చూస్తూ ఉండగానే క్షణాల్లో ఆ భవనం కూలిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ ( Viral Video) అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఉత్తర ఢిల్లీలోని రోషనారా రోడ్లోని మూడు అంతస్తుల బిల్డింగ్ను లాజిస్టిక్స్ సంస్థ జైపూర్ గోల్డెన్ ట్రాన్స్పోర్ట్ వినియోగిస్తున్నది. అయితే బుధవారం ఉదయం 11.50 గంటలకు ఆ భవనంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 18 వాహనాలతో అక్కడకు చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు.
కాగా, అందరూ చూస్తుండగానే ఉన్నట్టుండి ఆ భవనం కుప్పకూలింది. కేవలం ఐదు సెకండ్లలో ఆ బిల్డింగ్ పూర్తిగా నేలమట్టం అయ్యింది. ఆ భవనం చుట్టూ దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. లాజిస్టిక్స్ సంస్థ వినియోగించే బిల్డింగ్ కావడంతో అందులో ఎవరూ నివసించడం లేదని చెప్పారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి కారణం ఏమిటన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు అగ్నిప్రమాదం జరిగిన కొన్ని సెకండ్లలోనే ఆ భవనం పూర్తిగా నేలమట్టం కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్పందించిన కొందరు నెటిజన్లు ఈ వీడియో క్లిప్ గురించి ఫన్నీగా కామెంట్లు చేశారు.
A massive fire broke out in a building at Raushan Ara roadin Delhi leading to its collapse. 18 fire tenders rushed to the spot to control the fire.
Reports @AlokReporter pic.twitter.com/28LVGNRqud
— The New Indian (@TheNewIndian_in) March 1, 2023