Air Pollution | దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) అధ్వాన స్థితికి చేరింది. శనివారం వరుసగా నాలుగోరోజు కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 300కిపైనే నమోదైంది. గాలి నాణ్యత పడిపోవడంతో ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో విజిబిలిటీ తగ్గింది. దీంతో దగ్గు, గొంతు నొప్పి, కళ్ల మంటలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (Central Pollution Control Board) ప్రకారం.. ఘజియాబాద్లో ఏక్యూఐ 306, నోయిడా (278), గురుగ్రామ్ (266), ఫరిదాబాద్ (105)గా నమోదైంది.
ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రిసెర్చ్ నివేదిక ప్రకారం.. గాలి నాణ్యత 447కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని, AQI 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని అర్థం. ఇక AQI 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, AQI 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చు.
Also Read..
Fire | గరీబ్రథ్ ఎక్స్ప్రెస్లో భారీగా మంటలు.. తప్పిన పెను ప్రమాదం
చిన్నారులపై కీచక పర్వం!.. దేశంలో గత ఐదేండ్లలో 94 శాతం పెరిగిన లైంగిక నేరాలు
త్రిపురలో ముగ్గురు బంగ్లా స్మగ్లర్ల మృతి.. భారత్, బంగ్లా మధ్య రాజుకున్న దౌత్య వివాదం